గురుకుల వసతి గృహ విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ప్రతిపాదన సిద్ధం చేయాలని తెలిపారు. సంగారెడ్డి లోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాబోయే చలికాలంలో విద్యార్థులకు బ్యాంకెట్లు, దుప్పట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు భోజనం అందించాలన్నారు.