పీఎం కిసాన్ 19వ విడత కింద ఈనెల 24న రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. బిహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులు విడుదల చేయనున్నారు. అయితే E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి. ఈ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో, లేదో https://pmkisan.gov.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.