టీబీ రహిత దేశం కోసం ప్రజలు భాగస్వామ్యం కావాలి: కృష్ణ కుమార్

169பார்த்தது
టీబీ రహిత దేశం కోసం ప్రజలు భాగస్వామ్యం కావాలి: కృష్ణ కుమార్
దేశంలో క్షయ (టీబి) నిర్మూలనకు సామూహిక పోరాటం ప్రజల సహకారంతో సాధ్యమవుతుందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ (4 టైమ్స్), రచయిత, సోషల్ వర్కర్, ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డా.పెండెం కృష్ణకుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా టీబీ రాకుండా ఉండాలంటే మందులతో పాటు పౌష్టికాహారం చాలా అవసరం. కావున పేద క్షయ రోగిని దత్తత తీసుకొని వారికి ఆరు నెలల పాటు పౌష్టిక ఆహారం అందిస్తున్నానని మంగళవారం ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రం, మన్సూరాబాద్ నందు క్షయ రోగికి ఈనెల కొరకు పౌష్టిక ఆహారం సంబంధించిన గోధుమలు, కంది పప్పు, బియ్యం, రాగుల పిండి, మంచి నూనె, కోడిగుడ్లు మొదలగు సామగ్రి ని డా, , పెండెం కృష్ణ కుమార్ ఉచితంగా అందచేయడం జరిగింది.

ఈ సందర్భంగా కృష్ణ కుమార్ మాట్లాడుతూ పేద క్షయ రోగులను దత్తత తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ నిక్షయ మిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కాగలరని దేశంలో క్షయ వ్యాధి నిర్మూలనకు అందరూ సహకరించాలని పేద క్షయరోగులను ఆదుకొని టీబి లేని దేశం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ టీబి అధికారి డా, అరుణ, సిబ్బంది, విల్సన్, తిరుపతయ్య పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி