బాధిత కుటుంబానికి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

76பார்த்தது
బైంసా మండలం వానల్పాడ్ గ్రామానికి చెందిన భోజారాం పటేల్ ఇటీవల విద్యుత్ షాక్ తో మృతి చెందగా శుక్రవారం ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఐదు లక్షల చెక్కును అందజేశారు. విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు వారు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందులో ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி