గణేష్ నిమజ్జనానికి భారీ పోలీసు బందోబస్తు

78பார்த்தது
ముథోల్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహిస్తున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని భైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 8 మంది సీఐలు, 10మంది ఎస్ఐలు, 200 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు కొరకు నియమించడం జరిగిందని తెలిపారు. శాంతియుత వాతావరణంలో శోభాయాత్ర నిర్వహించాలని, నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி