పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపీడీఓ

63பார்த்தது
సీజనల్ వ్యాధుల నివారణకు ఇంటి ఆవరణ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓ వెంకట రమేష్ సూచించారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లోకేశ్వరం మండల కేంద్రంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డుల్లో పర్యటించి పాత కుండలు, టైర్లలో నిల్వ ఉన్న నీటిని సిబ్బందితో పారబోయించారు. ఇంటి పరిసరాల్లో మురుగు గుంతలు లేకుండా చూసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శి గంధం వినయ్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி