భైంసా ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్షం

73பார்த்தது
బైంసా ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. కాలు విరిగి ఆసుపత్రికి వచ్చిన ఓ పేషెంట్ ను స్ట్రచర్ పై తీసుకెళ్లేందుకు సిబ్బంది నిరాకరించారని శనివారం బాధితుడు తెలిపాడు. దీంతో గత్యంతరం లేక రోగి బంధువు అతన్ని స్ట్రచర్ పై కూర్చోబెట్టి ఆస్పత్రిలోనికి తీసుకెళ్లాడు. రోగుల బాగోగులు చూడాల్సిన సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி