కీర్గుల్ (కే) గ్రామంలో బైక్ చోరీ

76பார்த்தது
కీర్గుల్ (కే) గ్రామంలో బైక్ చోరీ
నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కీర్గుల్(కే) గ్రామంలో బైక్ చోరీ అయినట్లు బుధవారం ఎస్ఐ గణేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన మెంతన రాజు తన ఇంటి ముందు పార్క్ చేసిన టీఎస్18జి8704 నెంబర్ గల పల్సర్ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బైకు కనిపించడంలేదని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி