నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మానబోలు వద్ద మూసి నదిపై ఉన్న బ్రిడ్జిను ఆదివారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవర్ పరిశీలించారు. హైదరాబాద్ లో వచ్చిన వర్షానికి మూసినది ఉధృతంగా ప్రవహిస్తున్నందున మూసీ నది ప్రవహించే ప్రాంతం నుండి వెళ్లే ప్రజలు అప్రమతంగా ఉండాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రజలకు సూచించారు.