ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ భారత్, పాక్ మ్యాచ్ను వీక్షిస్తున్నారు. ఎంపీ కేశినేని చిన్ని, సినీ దర్శకుడు సుకుమార్.. లోకేశ్తో కలిసి ఫొటో దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే గ్రూప్-2 అభ్యర్థుల ఆవేదన పట్టించుకోకుండా దుబాయ్ లో మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారంటూ.. కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.