పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

51பார்த்தது
ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాణహిత వరద వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి డిమాండ్ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద ముంపుతో వేమనపల్లి, కోటపల్లి, చెన్నూర్ మండలాల్లోని రైతులు పంటలను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులకు భరోసా కల్పించాలన్నారు.

தொடர்புடைய செய்தி