మరో రెండు, మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల వల్ల ప్రభావితమైన రోడ్లు, కాలువలు మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టర్ కార్యాలయంలో మండలాల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాల వల్ల జరిగిన నష్టాలు, ప్రస్తుతం అత్యవసరంగా చేపట్టాల్సిన చర్యలపై ఆయన దిశా నిర్దేశం చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.