అనంత హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు

75பார்த்தது
అనంత హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అనంత హాస్పిటల్ వైద్యులు, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయిజ పట్టణానికి చెందిన 11 ఏళ్ల రతన్ కుమార్‌కు కడుపునొప్పి రావడంతో 16వ తేదీన తల్లిదండ్రులు అనంత హాస్పిటల్‌లో చేరించారు. నిర్లక్ష్య వైద్యం వల్ల బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించిందని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం జిల్లా కలెక్టర్, డిఎంహెచ్ఓకి ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி