రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత

63பார்த்தது
రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత
రాజమండ్రి శివారులో గత కొంత కాలంగా చిరుతపులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. తాజాగా రాజమండ్రి శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో మరోసారి చిరుత కదలికలు గుర్తించారు. ఆ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత కదలిక చిత్రాలు కనిపించాయని అధికారులు తెలిపారు. దీంతో చిరుతని ట్రాప్ బోనులతో పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిరుత పులిని ఖచ్చితంగా పట్టుకుంటామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி