ఎంపీటీసీ ఇంట్లో దొంగతనం..!!

9418பார்த்தது
ఎంపీటీసీ ఇంట్లో దొంగతనం..!!
కామేపల్లి మండలం తాళ్లగూడెం గ్రామంలో ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి తాళంకప్పలు పగలకొట్టి, లోనికి ప్రవేశించి 150000 నగదు, బంగారం ఒక చైన్, నెక్లెస్, బుట్టదిద్దులు 2 జతలు అపహరించుకు వెళ్లారు.
ఉదయం ఈ విషయాన్ని గమనించిన ఎంపీటీసీ పోలీస్ వారికి సమాచారాన్ని అందించగా అనంతరం వారు క్లూస్ టీమ్ ని పిలిపించి దర్యాప్తు ప్రారంభించారు.

అనంతరం సంఘటన జరిగిన ప్రదేశాన్ని స్థానిక సర్పంచ్ - లకావత్ సునీత, ఉపసర్పంచ్ - పుచకాయల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు - పుచ్చకాయల వీరభద్రం, జడ్పీటీసీ-వెంకటప్రవీన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు-గింజల నర్సింహారెడ్డి, నల్లమోతు మురళి, తెరాస మండల యువత - అంగడాల నరేష్, పోట్ల రామయ్య, దిరిశాల లక్ష్మయ్య, ఏపూరి పెద్ద మల్లిఖార్జునరావు, గోకర ఉపేందర్, బాలబోయిన వేలాద్రి తదితరులు సందర్శించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி