కామేపల్లి పోలీసుస్టేషన్ ముందు కాంగ్రెస్ నేతల నిరసన

678பார்த்தது
ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని కామేపల్లి మండలంలోని పింజరమడుగు గ్రామంలో సోమవారం జరిగిన వివాదం మండలంలో కాంగ్రెస్ నేతలు నిరసన దిశగా వెళ్ళడానికి దారితీసింది. వివరాలలోకి వెళ్తే పింజరమడుగు గ్రామంలో ధమ్మలపాటి సత్యం అనే వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన గుజ్జర్లపూడి సతీష్ చేయి చేసుకోవడంతో పరిస్థితి పోలీసుస్టేషన్ పరిధికి వచ్చి, ఉద్రిక్తత చోటుచేసుకుంది. దేనితో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నేతలంతా పోలీసుస్టేషన్ వద్దకు వచ్చి గోడవచేయటంతో పోలీసులు వారిని వారించి, అసలు గొడవ పరిస్థితి విచారించి గొడవకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி