పేదలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయాలి

61பார்த்தது
పేదలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయాలి
జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను గురువారం కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమూద్ ఖాన్ పాల్గొని గతంలో కేటాయించిన కుట్టు మిషన్లను అర్హులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇప్పటికే పంపిణీ చేయడం జరిగిందని, మన జిల్లాలో ఆలస్యం అయిందని అన్నారు.

தொடர்புடைய செய்தி