మతిస్థిమితం లేని గిరిజన యువతిపై అఘాయిత్యం

65பார்த்தது
మతిస్థిమితం లేని గిరిజన యువతిపై అఘాయిత్యం
మతిస్థిమితం లేని దివ్యాంగ గిరిజన యువతిపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటన దమ్మపేటలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఐదో నెల వచ్చాక కానీ తల్లిదండ్రులకు విషయం తెలియలేదు. అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడు ఎవరో చెప్పలేని దైన్యస్థితి. ఆమెను తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల కిందట గర్భస్రావమై ఆరోగ్యం దెబ్బతింది. ఈ ఘటనపై ఎస్సై సాయి కిశోర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி