ఆటోని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం వ్యక్తికి తీవ్రగాయాలు

561பார்த்தது
ఆటోని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం వ్యక్తికి తీవ్రగాయాలు
అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి గ్రామశివారు ముత్యాలమ్మతల్లి గుడి సమీపంలోని మలుపు దగ్గర మొదటి స్పీడ్ బ్రేకర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రక్క ఆగి ఉన్న ఆటోని కొప్పుల రామకృష్ణ (55) ద్విచక్రవాహనంతో ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కొప్పుల రామకృష్ణకి తీవ్ర గాయాలయ్యాయనీ, స్పందించిన స్థానికులు అంబులెన్స్ కి ఫోన్ చేసి, పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.

தொடர்புடைய செய்தி