చెరువుకు గండిపడి వృధాగా పోతున్న నీరు

53பார்த்தது
దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామ పంచాయతీలో చెరువుకు గండిపడి నీరు వృధాగా పోతుందని ఆదివాసి నాయకులు రవి అన్నారు. గురువారం గండిని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, గతంలో చిన్నగా ఉన్న గండి అధికారులు నిర్లక్ష్యంతో మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల పెద్దగా అయిందన్నారు. కరకట్ట పూర్తిగా తెగితే దిగువనున్న గ్రామాల్లో వరదనీరు చేరే అవకాశం ఉందన్నారు. అధికారులు స్పందించి చెరువుకు పడిన గండికి తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி