గొర్రెల కాపరి రాములు కుటుంబానికి సాయం అందజేత

2267பார்த்தது
ములకలపల్లి మండలం ఒడ్డు రామవరం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి భూక్యా రాములు గురువారం ప్రమాదవశాత్తు సీతారామ కాలువలో పడి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకరావు, కాంగ్రెస్ నాయకులు అంజి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రూ. 3 లక్షల నగదును మృతుడి కుటుంబసభ్యులకు శనివారం అందజేశారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన ఇరిగేషన్ శాఖకు, స్థానిక నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி