కేశవపట్నంలో కేపీఎల్ -4 క్రికెట్ టోర్నమెంట్

63பார்த்தது
శంకరపట్నం మండలం కేశవపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం వేసవికాల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. కేశవపట్నంలో మూడు పర్యాయాలు విజయవంతంగా ఈ క్రీడలను నిర్వహించి ఇప్పుడు కేపీఎల్ సీజన్-4 పేరున ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు సీనియర్ క్రీడాకారుడు సంపత్ పేర్కొన్నారు. యువకులకు క్రీడలతో మానసికోల్లాసం, శరీర పట్టుత్వం, స్నేహభావం పెంపొందుతాయని మాజీ ఉప సర్పంచ్ హనుమంతు, వంగ సత్యనారాయణ, విజయ్ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி