హరితహారానికి మొక్కలు అందుబాటులో ఉంచాలి

62பார்த்தது
హరితహారానికి మొక్కలు అందుబాటులో ఉంచాలి
నర్సరీలలోని మొక్కలను వచ్చే హరితహారం కార్యక్రమం నాటికి అందుబాటులో ఉంచాలని, నిరంతర పారిశుద్ధ్య కార్యక్రమం కొనసాగించాలని జగిత్యాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర అన్నారు. మంగళవారం మెట్పల్లి మండలంలో పలు గ్రామాలలోని నర్సరీలు, ఆదర్శ పాఠశాలల పనులు, తదితర కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ దేవరాజ్, ఎంపీఓ మహేశ్వర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు నారాయణ, రవి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி