హుజురాబాద్ - Huzurabad

పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం

పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముఖ్యంగా తెలంగాణ శాసనసభలో పీఏసీగా ఎన్నికైన అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు, మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో గురువారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై పలువురు దాడి చేశారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు.. ఫిర్యాదు చేయడానికి సైబరాబాద్ సీపీ కార్యాలయానికి వెళ్లారు. పోలీసులు మాత్రం కేవలం ముగ్గురు ఎమ్మెల్యేకు మాత్రమే సీపీ ఆఫీసులోకి అనుమతిస్తామని.. గేటు వద్దనే నిలిపివేశారు. కాసేపు పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. అనంతరం హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సీపీ లేకపోవడంతో జాయింట్ సీపీకి ఫిర్యాదు చేశారు.

வீடியோஸ்


కరీంనగర్ జిల్లా