కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్

65பார்த்தது
కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ మండలంలో ఎల్పుగొండ, వాడిలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం తూకం వేసిన వెంటనే జాప్యం లేకుండా సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఓ. ఆర్. ఎస్. ప్యాకెట్లు, మంచినీరు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు.

தொடர்புடைய செய்தி