ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. నాలుగో ఓవర్లో 142.1 KMPH స్పీడ్తో షహీన్ షా అఫ్రిది వేసిన ఆఖరి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. 15 బంతుల్లో మూడు ఫోర్లు, 1 సిక్సర్తో 20 పరుగులు చేసి హిట్మ్యాన్ పెవిలియన్ చేరాడు. దీంతో 5 ఓవర్లు పూర్తయేసరికి టీమిండియా స్కోర్ 31/1గా ఉంది.