ఇది ఎంతో అద్భుతమైన దేవాలయం. స్థల పురాణం ఎంతో గొప్పగా ఉంది. ఆలయ పరిసరాలు వైభవోపేతంగా తీర్చిదిద్దారు అంటూ ప్రముఖ టాలీవుడ్ సినీ సంగీత దర్శకుడు ఆర్. పి పట్నాయక్ అన్నారు. బుధవారం షాద్ నగర్ నియోజకవర్గం కేంద్రంలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ దంపతులు భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.