అద్భుతమైన అలంకరణలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు

60பார்த்தது
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. నేడు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాన్ని పూలతో ముస్తాబు చేశారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి పూజలు చేశారు. ఉదయం నుంచే అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రాక కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி