హిందువుల మనోభావాలను దెబ్బతీశారు: మంచు మనోజ్

73பார்த்தது
హిందువుల మనోభావాలను దెబ్బతీశారు: మంచు మనోజ్
తిరుమల లడ్డూ వ్యవహారంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం ఆందోళనకరమన్నారు. ఇది లోపం కాదని, విశ్వాసాన్ని దెబ్బతీసినట్లేనన్నారు. హిందువులను అవమానపరిచారని, అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బాధ్యులను గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదాయాల ఉల్లంఘనలను సహించబోమని.. మనం ఒక ఉదాహరణగా నిలవాలని Xలో ట్వీట్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி