యూపీలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఓ యువకుడు నిబంధనలకు విరుద్ధంగా బీజేపీకి ఏకంగా 8 సార్లు ఓటేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అతను ఫరూకాబాద్ బీజేపీ అభ్యర్థి ముకేశ్ రాజ్పుత్కు ఓ పోలింగ్ బూత్లో ఓటేసినట్టు వీడియోలో ఉంది. దీంతో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా పలు ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. అతడిని రంజన్ సింగ్గా గుర్తించారు.