పెళ్లికి గెస్ట్గా వచ్చిన ఓ యువకుడు స్టేజిపై పెళ్లి కొడుకును చితక్కొట్టాడు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. బిల్వారా పట్టణంలో పెళ్లి జరుగుతుండగా, ఓ యువకుడు స్టేజిపైకి ఎక్కి వధూవరులతో ఫోటోలు దిగాడు. ఇంతలోనే ఉన్నట్టుండి పెళ్లి కొడుకుపై దాడికి దిగాడు. అయితే పెళ్లికూతురు, ఆ యువకుడు ఒకే స్కూల్లో పనిచేస్తుండగా, వారి మధ్య ప్రేమాయణం నడిచినట్టు తెలిసింది.