ఈ నెల 5వ తేదీ నాటికి వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో మంగళవారం నుంచి రాబోయే ఐదు రోజులు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, KMM, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, WGL, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.