విద్యార్థులతో మసాజ్ చేయించుకుంటున్న మహిళా టీచర్ (వీడియో)

85பார்த்தது
రాజస్థాన్‌లోని జైపూర్ ప్రాంతంలో గురువారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఓ మహిళా టీచర్ మసాజ్ చేయించుకుంటుంది. కర్తార్‌పూర్ ప్రభుత్వ హైయర్ ప్రైమరీ స్కూల్ లో ఓ టీచర్ నేలపై పడుకొని ఉండగా.. ఇద్దరు విద్యార్ధులు ఆమె కాళ్లపై నిలబడి మసాజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி