కొడుకు ముందే తండ్రిని తుపాకీతో కాల్చి చంపేశారు (వీడియో)

77பார்த்தது
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో మంగళవారం దారుణ ఘటన జరిగింది. అక్కడి దస్తక్ న్యూస్‌లో అలీ(35) అనే వ్యక్తి జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. అలీ తన కుమారుడితో కలిసి ఓ హాస్పిటల్ రోడ్డులో స్కూటీపై కూర్చొని ఉండగా.. ముగ్గురు దుండగులు కొడుకు ముందే జర్నలిస్టుపై కాల్పులు జరిపారు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 103 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி