హైదరాబాద్- నాగోల్ పరిధిలోని ఫతుల్లాగూడ సమీపంలో ఓ యువతీ, యువకుడు కారును రోడ్డుపై ఉంచి సిగరెట్, బీర్లు తాగారు. మార్నింగ్ వాకింగ్ చేసే వారు అది గమనించి.. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో మద్యం మత్తులో యువతి మార్నింగ్ వాకర్స్ను బూతులు తిట్టింది. దీంతో ఫిర్జాదీగూడ వాసి అలెక్స్ (25), మరో యువతిపై ఐపీసీ 341, 504 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.