బిజెపి అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటిఇంటి ప్రచారం

11881பார்த்தது
బిజెపి అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటిఇంటి ప్రచారం
కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని కొమురవెల్లి మండల ఉపాధ్యక్షుడు బ్రాహ్మండ్లపల్లి బాబు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని కొమురవెల్లి మండలం గురువన్నపేటలో బిజెపి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనకయ్య, శ్రీను, శ్రీనివాస్ చంద్రం, దనుంజయలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி