పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ.. రష్యా-ఇరాన్‌ అధ్యక్షుల భేటీ

67பார்த்தது
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ.. రష్యా-ఇరాన్‌ అధ్యక్షుల భేటీ
ఇటు, ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేస్తుంటే.. అటు ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజిష్కియాన్‌ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. తుర్క్‌మెనిస్థాన్‌ రాజధాని ఆష్గాబత్‌లో సమావేశం కానున్నారు. రష్యాకు చెందిన ఎస్‌యూ-35 యుద్ధవిమానాలు, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400 వంటి వాటిని ఇరాన్ కోరుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

தொடர்புடைய செய்தி