నేడు మహిషాసురమర్దిని దేవీగా దర్శనమివ్వనున్న అమ్మవారు

60பார்த்தது
నేడు మహిషాసురమర్దిని దేవీగా దర్శనమివ్వనున్న అమ్మవారు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శుక్రవారం మహిషాసురమర్దిని దేవీగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోక కంటకుడైన మహిషాసురుణ్ని చంపిన మహోగ్రరూపం ఇది. సకల దేవీ, దేవతల శక్తులన్నీ ఈ దేవీలో మూర్తీభవించి ఉంటాయి. మానవనేత్రంతో చూడ సాధ్యం కాని దివ్యతేజస్సుతో, అనేక ఆయుధాలతో సింహవాహినియై ఈ తల్లి భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తుంది. మహిషాసుర సంహారం జరిగిన రోజునే 'మహర్నవమి'గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

தொடர்புடைய செய்தி