అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

574பார்த்தது
అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
మహారాష్ట్ర సరిహద్దుకు ఉన్న భీంపూర్ మండలం కరంజి, తలమడుగు మండలం లక్ష్మీపూర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ లను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరును పరిశీలించారు. 24 గంటలు అప్రమత్తతో ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సిబ్బందికి తెలియజేశారు. పరిశీలించే విధానాన్ని పూర్తిగా వీడియోగ్రఫీ నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. సీఐలు, ఎస్ఐ లు, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி