రాజ్కోట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగి 22 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందిస్తూ స్థానిక MLA నవ్వుతూ మీడియాతో మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఘటనాస్థలానికి వచ్చిన BJP MLA రమేశ్ బాయ్ తిలారాను సహాయక చర్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అందుకు ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఈ వీడియో వైరల్ కాగా 'అమాయక ప్రజలు చనిపోతే మీకు నవ్వులాటగా ఉందా?' అంటూ ఆయనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.