AP: యువతకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 10,000కు పైగా ఉద్యోగాలు రాబోతున్నట్లు వెల్లడించారు. విశాఖలోని గీతం యూనివర్సిటీ వేదికగా నిర్వహించనున్న కెరీర్ ఫెయిర్లో 49 అగ్రశ్రేణి ఐటీ, ఐటీ సంబంధిత కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ ఫెయిర్లో పదివేల ఉద్యోగావకాశాలను కల్పించనున్నామని.. రాష్ట్ర యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకేశ్ ట్వీట్ చేశారు.