May 19, 2025, 08:05 IST/
నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి: భట్టి
May 19, 2025, 08:05 IST
TG: నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని DyCM భట్టి విక్రమార్క అన్నారు. దేశ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని పేర్కొన్నారు. భూమి కోసం ఈ గడ్డపై అనేక పోరాటాలు జరిగాయని.. గిరిజనుల సంక్షేమం కోసం గొప్ప కార్యక్రమం తీసుకొచ్చామని చెప్పారు. నాగర్కర్నూల్ (D) మాచారం వేదికగా నల్లమల డిక్లరేషన్ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. దీని ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు జరుగనున్నాయి.