Jul 26, 2024, 05:07 IST/
తెలంగాణలో మరో పథకం క్లోజ్..!
Jul 26, 2024, 05:07 IST
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గొర్రెల పంపిణీ పథకానికి నిధులేమీ కేటాయించలేదు. దీంతో గత ఆరేళ్లుగా అమలవుతున్న ఆ పథకం ఇక లేనట్లేనని తెలుస్తోంది. వీటి పంపిణీలో అవినీతి ఆరోపణలున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్యకు కూడా బడ్జెట్లో నిరాశే దక్కింది. దీంతో ఆయా వర్గాల్లో ఆందోళన మొదలైంది. యాదవ, కురుమ వర్గాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్కీంను తెచ్చిన విషయం తెలిసిందే.