May 07, 2024, 00:05 IST/కోరుట్ల
కోరుట్ల
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పై మెట్ పల్లి డిఎస్పి విచారణ
May 07, 2024, 00:05 IST
మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పై సోమవారం డిఎస్పి ఉమామహేశ్వరరావు మెట్ పల్లి పట్టణ శివారులోని మైసమ్మ గుట్ట వద్ద విచారణ చేపట్టారు. ఈనెల 4వ తేదీన పట్టణంలోని మైసమ్మ గుట్ట వద్ద సమాచారం మేరకు అక్రమంగా మొరం తవ్వుతున్నారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్ళగా తరి రాజశేఖర్ పై అక్కడే ఉన్న ఇరుగదిండ్ల వెంకటేష్ కులం పేరుతో దూషించడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో తరి రాజశేఖర్ ఫిర్యాదు చేశారు.