May 04, 2025, 15:05 IST/
నీట్’ పరీక్ష రాసేందుకు వెళ్తూ ముగ్గురు దుర్మరణం
May 04, 2025, 15:05 IST
నీట్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగి ముగ్గురు మృతిచెందిన ఘటన రాజస్థాన్లోని జైపుర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థినులు మరో వ్యక్తితో కలిసి బైక్ పై నీట్ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. మృతులను ఖుషి శర్మ (21), ప్రియా శర్మ(22)గా పోలీసులు గుర్తించారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు.