రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

80பார்த்தது
రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు చాలీచాలని పెన్షన్ తో దుర్భర జీవితం గడుపుతున్నారని రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.ఆర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1000 పెన్షన్ తో ఎలా బతకాలో చెప్పాలని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలపై ఈ నెల 13వ తేదీన ఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నా చేపట్ట నున్నామని తెలిపారు.

தொடர்புடைய செய்தி