ట్రాన్స్ ఫార్మర్ లోని రాగి వైరు చోరీ

69பார்த்தது
ట్రాన్స్ ఫార్మర్ లోని రాగి వైరు చోరీ
ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లె గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. పాలడుగు కాశీ రావు అనే రైతు పొలంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లోని రాగి వైరును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ట్రాన్స్ ఫార్మర్ ను పగలగొట్టి మరి దొంగలు రాగి వైరును చోరీ చేశారు. రైతు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఏఈ అల్లూరయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி