ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటుపై పోలీసు శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించింది. గతంలో అగ్నిమాపక, విద్యుత్, పోలీస్ శాఖల నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉండేది. ఈ సారి https://www.ganeshutsav.net/ వెబ్సైట్ లేదా 79950 95800 నంబర్కు వాట్సాప్లో ‘HI’ అని మెసేజ్ చేసి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.