AP: రాష్ట్ర సీఎంగా ఈ నెల 12న ఉ.11.27 గంటలకు
టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరిగే ఈ కార్యక్రమానికి
బీజేపీ లోక్సభాపక్ష నేత నరేంద్ర
మోదీ.. ప్రధాని హోదాలో హాజరుకానున్నారు. అలాగే
బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ సీఎంతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కాగా,
మోదీ ఎల్లుండి పీఎంగా ప్రమాణం చేయనున్నారు.