గంజాయి రవాణా కట్టడి చేస్తాం: సీఐ

71பார்த்தது
పొన్నూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పొన్నూరు, కాకుమాను, పెదనందిపాడు మండలాలలో అక్రమ మద్యం, గంజాయి రవాణాను కట్టడి చేస్తామని పొన్నూరు ఎక్సైజ్ సీఐ ఎం. రమేష్ అన్నారు. సోమవారం కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న నూతన మద్యం పాలసీని సక్రమంగా నిర్వహించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తానని పేర్కొన్నారు. పలువురు సిబ్బంది సీఐకి పుష్పగుచ్చాలందించారు.

தொடர்புடைய செய்தி