గుంటూరు, నరసరావుపేట వైసీపీ పరిశీలకులుగా మోదుగుల

50பார்த்தது
గుంటూరు, నరసరావుపేట వైసీపీ పరిశీలకులుగా మోదుగుల
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పలువురికి కీలక పదవులకు దక్కాయి. ఈ మేరకు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు నూతన అధ్యక్షులను బుధవారం నియమించారు. అదేవిధంగా గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులుగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని నియమించారు. గతంలో నరసరావుపేట ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అదేవిధంగా గుంటూరులో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.

தொடர்புடைய செய்தி